రాష్ట్రంలో బీసీలకు అవమానం

ABN , First Publish Date - 2022-05-22T05:13:06+05:30 IST

రాష్ట్రంలో బీసీలకు అవమానాలు ఎదురవుతున్నాయని, పొరుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపీ విమర్శించారు.

రాష్ట్రంలో బీసీలకు అవమానం
బీసీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న రొంగలి శ్రీనివాస్‌

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపి

ప్రధానిగా బీసీకి అవకాశం బీజేపీ ఘనత

విశాఖపట్నం, మే 21: రాష్ట్రంలో బీసీలకు అవమానాలు ఎదురవుతున్నాయని, పొరుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపీ విమర్శించారు. స్థానిక జీవీఎంసీ కల్యాణ మండపంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓబీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ చీకటి ఆర్థిక లావాదేవీల్లో భాగంగా పాలకులు రాష్ట్రేతరులకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


బీజేపీ బీసీలను ఎంతో గౌరవిస్తుందనేందుకు 103 మంది బీసీ ఎంపీలు, అందులో 27 మంది మంత్రులుండడం నిదర్శనమన్నారు. సాక్షాత్తు ప్రధాని బీసీ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిధులు, విధుల్లేకుండా తూతూ మంత్రంగా అవి నడుస్తున్నాయన్నారు.


ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపాటి రవీంద్రారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసులునాయుడు, ఉపాధ్యక్షుడు యడ్ల రమణరాజు, ఓబీసీ మోర్చాన ప్రతినిదులు సనపల రామకృష్ణ, జిల్లా, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-22T05:13:06+05:30 IST