జములమ్మకు శమీపూజ, తెప్పోత్సవం

ABN , First Publish Date - 2021-10-17T04:31:42+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతీరోజు ఓ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన జములమ్మ అమ్మవారు దసరా పండుగరోజు ని జరూప దర్శనమిచ్చారు.

జములమ్మకు శమీపూజ, తెప్పోత్సవం
అమ్మవారి తెప్పోత్సవంలో పాల్గొన్న భక్తులు

గద్వాల రూరల్‌, అక్టోబరు 16: శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతీరోజు ఓ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన జములమ్మ అమ్మవారు దసరా పండుగరోజు ని జరూప దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌ కుమా ర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాంతం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం శ మీపూజ నిర్వహించారు. పల్లకిలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం రిజర్వాయ ర్‌లో తెప్పోత్సవం నిర్వహించారు.  కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు మేడి కొండ జానికిరాములు, మాధవికాంమ్లే, కమ్మరిరాము, శంకర్‌లతో పాటు ఆలయ ఉ ద్యోగులు మురళీధర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాష్‌, శివలింగం, సురేష్‌, మద్దిలేటి, నాగరాజు, రామక్రిష్ణ, పాండు, అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:31:42+05:30 IST