డ్రగ్స్ను క్యాప్సూల్స్గా పొట్టలో దాచి తరలించేందుకు యత్నం...
ABN , First Publish Date - 2022-05-04T19:30:01+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. రూ.11.53 కోట్ల విలువచేసే 1,390 గ్రాముల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడు డ్రగ్స్ను క్యాప్యూల్స్ రూపంలో పొట్టలో దాచి తరలించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి పొట్టలో నుంచి హెరాయిన్ను బయటకు తీశారు. దాదాపు 108 క్యాప్యూల్స్ కేటుగాడు మింగినట్లు తెలుస్తోంది. జోహనెస్బర్గ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.