అమ్మవారి ఆలయాలకు శరన్నవరాత్రుల శోభ

ABN , First Publish Date - 2022-09-27T06:07:20+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉ త్సవాలు సోమవారం జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మూలవిరాట్‌లను సర్వాంగసుందరంగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు.

అమ్మవారి ఆలయాలకు శరన్నవరాత్రుల శోభ
హిందూపురంలో ప్రత్యేక అలంకరణలో కొల్హాపురి లక్ష్మీదేవి

హిందూపురం అర్బన, సెప్టెంబరు 26: దసరా శరన్నవరాత్రి ఉ త్సవాలు సోమవారం జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మూలవిరాట్‌లను సర్వాంగసుందరంగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు. సూరప్ప కట్ట బోయకొండ గంగమ్మ, వాల్మీకి వీధి కొల్హాపురి లక్ష్మీ, రేణు కా యల్లమ్మ ఆలయాల్లో అమ్మవారు దానేశ్వరీదేవిగా కొలుదీరారు. మూలకంఠమ్మ ఆలయంలో బాలత్రిపురా సుందరిగా, నింకంపల్లి రోడ్డు యల్లమ్మ, జలదుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించారు.  వాస వీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో నాగదేవతగా భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 


లేపాక్షి: స్థానిక దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో దుర్గాదేవి అమ్మ వారు లక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలకు భక్తు లు పోటెత్తారు. మంగళవారం అమ్మవారు గాయత్రిదేవి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు. 


సోమందేపల్లి: స్థానిక పాత ఊరుచౌడేశ్వరీ ఆలయంలో ఉత్సవాల కు అంకురార్పణ చేశారు. కన్యకా పరమేశ్వరీ అమ్మవారు నారసింహుని అలంకరణలో దర్శనమిచ్చారు. పెద్దమ్మ, అంబాభవానీ ఆలయాలను వి ద్యుద్దీపాలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 


చిలమత్తూరు: మండలంలోని కుషావతి నది ఒడ్డున వెలసిన ఏటి గంగమ్మకు వివిధ పుష్పాలతో అలంకరణ చేశారు. అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. 


మడకశిర రూరల్‌: మండలంలోని నీలకంఠాపురంలో పార్వతి దేవి పసుపు వర్ణంతో భక్తులకు దర్శనమిచ్చారు. జమ్మానిపల్లిలో లక్ష్మీనిడిమామిడమ్మ, కల్లుమర్రిలో వీరకేతమ్మ, ఆమిదాలగొంది కనుమ మారె మ్మ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు.


గోరంట్ల: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ మాత అర్ధనారీశ్వరుడిగా, చౌడే శ్వరీదేవిని బాలత్రిపుర సుందరిగా, గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ దేవతను గాయిత్రీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అన్నదానం చేశారు. 


పరిగి: స్థానిక కాళీకాఅమ్మవారికి పసుపు కుంకుమ అలంకరణ చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


అగళి: మండలంలోని నరసాంబుదిలో లక్ష్మీరంగనాథస్వామి, అగళి శంకరేశ్వరస్వామి, కన్యకాపరమేశ్వరీదేవి, మధూడిలో వీరభద్రేశ్వరస్వా మి, కొమరేపల్లిలో బీరలింగేశ్వరస్వామి, పీబ్యాడిగెరలో కొల్లాపురి మహాలక్ష్మీదేవి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.


రొళ్ల: మండలంలోని రత్నగిరిల కొల్లాపురి మహాలక్ష్మీ, శ్రీకాళికాంబ అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక సమీప కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు తరలివచ్చారు.


పెనుకొండ: స్థానిక కన్యకాపరమేశ్వరీ దేవిని పసుపు కుంకుమ అలంకరణలో, లక్ష్మీ వెంకటరమణస్వామిని మత్స్యకార అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు కొనసాగాయి.

Updated Date - 2022-09-27T06:07:20+05:30 IST