కేసీఆర్‌, కేటీఆర్‌కు షర్మిల సవాల్‌

ABN , First Publish Date - 2022-05-06T01:27:14+05:30 IST

కేసీఆర్‌, కేటీఆర్‌కు షర్మిల సవాల్‌

కేసీఆర్‌, కేటీఆర్‌కు షర్మిల సవాల్‌

ఖమ్మం: అన్నివర్గాలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ తప్పుడు సంతకం వల్ల యాసంగిలో రైతులు నష్టపోయారని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. బంగారు తెలంగాణను బతుకే లేని తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గుడులు, బడులకన్నా మద్యం షాపులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ అక్రమంగా కోట్లు సంపాదించారని బీజేపీ చెబుతోందని, అక్రమాలపై ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదు? అని షర్మిల ప్రశ్నించారు.


కేసీఆర్‌, కేటీఆర్‌కు సవాల్‌ చేస్తున్నామని, తెలంగాణలో ప్రజాసమస్యలు లేవంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌ తనతో పాదయాత్రకు రావాలని వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాసమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికివెళ్తానని షర్మిల ప్రకటించారు. ప్రజా సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మళ్లీ ఓట్లేస్తే తెలంగాణను అమ్మేసినట్లే అని, ప్రజల కోసం పనిచేసేవారికి ఓట్లేస్తే రాష్ట్రం బాగుపడుతుందని షర్మిల అన్నారు.

Read more