కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారు: షర్మిల
ABN , First Publish Date - 2021-05-09T18:29:06+05:30 IST
కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారని వైఎస్ షర్మిల ట్విట్టర్లో పేర్కొన్నారు.
హైదరాబాద్: కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారని వైఎస్ షర్మిల ట్విట్టర్లో పేర్కొన్నారు. బాధితులు ఆస్పత్రుల్లో డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టనిదే శవాన్ని సైతం ఆస్పత్రులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల ట్విట్టర్ వేదికగా కోరారు.