పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టుగా కేసీఆర్ తీరు
ABN , First Publish Date - 2022-05-28T08:40:01+05:30 IST
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే.. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్లడం.. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లుగా ఉందని
- సీఎం పర్యటనలపై షర్మిల.. నేడు పాదయాత్ర పునఃప్రారంభం
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే.. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్లడం.. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లుగా ఉందని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఢిల్లీ కోటను బద్దలు కొడతామన్న కేసీఆర్ హైదరాబాద్కు వచ్చిన మోదీని నిలదీయకుండా ఎక్కడికి పారిపోయారని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కాగా, షర్మిల తన పాదయాత్రను సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ నుంచి పునః ప్రారంభించనున్నారు. ఈ నెల 6న తన పాదయాత్రకు ఆమె విరామం ఇచ్చారు. వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి అయిన పైలాన్ వద్ద నుంచి తన పాదయాత్రను శనివారం పునఃప్రారంభిస్తున్నారు.