Sharmila.. ఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ను కలవనున్న షర్మిల
ABN , First Publish Date - 2022-10-07T16:28:42+05:30 IST
ఢిల్లీ (Delhi): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (Sharmila) ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ (Delhi): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (Sharmila) ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్ను కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐ (CBI)ని కోరునున్నారు. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ (TRS Govt.) అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2.30 గంటలకు షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
కాగా పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. షర్మిల వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్టీపీ నేతలు ఉన్నారు.