అన్నదాతలను మోసం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు: షర్మిల
ABN , First Publish Date - 2022-04-12T02:25:52+05:30 IST
అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేసిన ప్రతీఒక్కరు కాలగర్భంలో కలిసిపోతారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు
బయ్యారం: అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేసిన ప్రతీఒక్కరు కాలగర్భంలో కలిసిపోతారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సోమవారం 52వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై నెపం మోపుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విరుచుకపడ్డారు. గ్రామాల్లో మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డగా నాకు అధికారం అందిస్తే తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చి గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తామని షర్మిల తెలిపారు.