రైతుల ఆత్మహత్యలు కేసీఆర్కు కనబడట్లేదా..?: షర్మిల
ABN , First Publish Date - 2022-04-17T01:44:02+05:30 IST
రైతుల ఆత్మహత్యలు కేసీఆర్కు కనబడట్లేదా..? అని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు.
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు కేసీఆర్కు కనబడట్లేదా..? అని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. శనివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో ఒక్కరికేనా పెన్షన్.. ఇదెక్కడి న్యాయం? అని కేసీఆర్ ని ప్రశ్నించారు. రైతులు పంట నష్టపోతుంటే పరిహారం చేయడం లేదని, ఈ విషయాలు కేసీఆర్ బయటికి వస్తేనే కదా తెలిసేదన్నారు. 36 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.ఎంతమందికి రుణమాఫీ చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిభగల యువత అవకాశాలు లేక కూలీలుగా మారుతున్నారని షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.