కేటీఆర్ దోస్తులంతా ఆంధ్రా ధనవంతులే..: షర్మిల
ABN , First Publish Date - 2022-04-30T23:27:40+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆమె స్పందించారు. ‘‘కేటీఆర్ దోస్తులంతా మేఘా కృష్ణారెడ్డి, ఫినిక్స్ సురేష్ లాంటి..వారే ఉన్నారు. వీరంతా ఆంధ్రా ధనవంతులే కదా!. తెలంగాణలో ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, ఆదివాసీలు ఉన్నారు. పేదలతో స్నేహం చేసుంటే కదా చిన్నదొరకి ప్రజల కష్టం తెలిసేది? చిత్తం శివుడి మీద..భక్తి చెప్పుల మీద!: ఉంది’’ అని షర్మిల ట్వీట్ చేశారు.