రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో నాల్గవ రోజు Sharmila పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-23T13:03:27+05:30 IST
షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సాగింది. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం నాటికి నాలుగు రోజులకు
రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సాగింది. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం నాటికి నాలుగు రోజులకు చేరుకుంది. నేడు పోషెట్టి గుడా క్యాంప్ నుంచి ఉదయం 9.30కి పాదయాత్ర మొదలు పెట్టనుంది. రాజేంద్ర నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని రషీద్ గుడా, గొల్లపల్లి, హమిదుల్ల నగర్, చిన గోల్కొండ, పేద గోల్కొండ, బహదూర్ గుడాలో పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం శంషాబాద్ లో బస్టాండ్ వద్ద జరిగే సభలో ప్రసంగించనుంది.