పాలమూరు మహిళలతో 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం
ABN , First Publish Date - 2021-03-02T21:11:20+05:30 IST
జిల్లా మహిళలతో ఈ నెల 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం
మహబూబ్ నగర్: జిల్లా మహిళలతో ఈ నెల 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు షర్మిల ప్రధాన అనుచరుడు రాఘవరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ను తలచుకొని మహబూబ్ నగర్ అభిమానులు కంటతడి పెట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ జెండా కప్పుకున్నోళ్లకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడంలో అన్ని రంగాల్లో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు.
వైఎస్ కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడితే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబుకు తొత్తులా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లెక్క ఎంతని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కొనుగోలు కేసులో 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని, అలాంటి రేవంత్ రెడ్డికి వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. వైఎస్ కుటుంబంపై రేవంత్ రెడ్డి మర్యాదగా మాట్లాడాలని ఆయన సూచించారు. లేకుంటే రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు.