ప్రతిభకు పదునుపెట్టండి

ABN , First Publish Date - 2021-03-07T05:14:13+05:30 IST

ప్రతి విద్యార్థి తమ కోర్సు పూర్తయిన అనంతరం ప్రతిభకు పదునుపెట్టాలని టెక్కలి సెంచూరియన్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య సీవీ గోపీనాథ్‌ అన్నారు.

ప్రతిభకు పదునుపెట్టండి
మాట్లాడుతున్న రిజిస్ర్టార్‌ గోపీనాథ్‌

   సెంచూరియన్‌ రిజిస్ట్రార్‌ గోపీనాథ్‌

నెల్లిమర్ల, మార్చి 6: ప్రతి విద్యార్థి తమ కోర్సు పూర్తయిన అనంతరం ప్రతిభకు పదునుపెట్టాలని టెక్కలి సెంచూరియన్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య సీవీ గోపీనాథ్‌ అన్నారు. బీఎస్సీ ఆప్టోమెట్రీలో నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తయిన విద్యార్థులకు శనివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు వివిధ కంటి ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్‌ చేసి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆప్టోమెట్రీ కోర్సుకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో పూర్వ రిజిస్ట్రార్‌ పల్లవి, పారామెడికల్‌ డీన్‌ లక్ష్మీనరసింహాచార్యులు, డాక్టర్‌ అరుణ్‌, ఇందు ప్రియ, సన్నీ, డాక్టర్‌ సుప్రజ, ఆప్టోమెట్రీ విభాగం అధిపతి, శ్రావణి, ఈశ్వర్‌, వినయ్‌ పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-03-07T05:14:13+05:30 IST