Shashikala: 21 నుంచి తిరువళ్లూర్ జిల్లాలో శశికళ పర్యటన
ABN , First Publish Date - 2022-09-18T15:38:02+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కత నాయకురాలు వీకే శశికళ(VK Shashikala)ఈ నెల 21 నుంచి తిరువళ్లూర్ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 17: అన్నాడీఎంకే బహిష్కత నాయకురాలు వీకే శశికళ(VK Shashikala)ఈ నెల 21 నుంచి తిరువళ్లూర్ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె టి.నగర్లోని తన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరి కోయంబేడు వంతెన, మాధవరం జంక్షన్, రెడ్హిల్స్, పాడియనల్లూర్ మీదుగా కన్నిగైపేర్ చేరుకుంటారు. అక్కడి నుంచి పెరియపాళయం, తండం, పాలవాక్కం, ఊత్తుకోట, గుమ్మిడిపూండి తదితర ప్రాంతాలకు వెళ్లి అన్నాడీఎంకే అసంతృప్తి నేతలు, కార్యకర్తలు, ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు.