క్రీడలతో మైత్రీ భావం పెంపు
ABN , First Publish Date - 2021-04-18T06:30:27+05:30 IST
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ధారుడ్యాన్ని ఉపకరిస్తాయని ఎస్సై అంబటి చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు.
పామూరు, ఏప్రిల్ 17: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ధారుడ్యాన్ని ఉపకరిస్తాయని ఎస్సై అంబటి చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో కాలనీలో ఆల్ఫా ఒలంపియార్డ్ స్కూల్ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండోర్ షెటిల్ కోర్టును శుక్రవారం రాత్రి ప్రారంభించారు. విద్యార్ధులతో పాటు యువత క్రీడారంగంలో రాణించి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. క్రీడాకారుల కోసం షెటిల్ కోర్టును ఏర్పాటు చేసిన ఆల్ఫా యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పామూరు, నుచ్చుపొద ఉప సర్పంచ్లు వైవి సాయికిరణ్, గోళ్ల వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, మాజీ సర్పంచ్ డీవీ.మనోహర్, వార్డుసభ్యులు షేక్ నాయబ్ రసూల్, ఇర్రి క్రిష్ణారెడ్డితో పాటు వైసీపీ నాయకులు జి.హుస్సేన్రెడ్డి, రామిరెడ్డి, షంషూర్, గోవిందయ్య, కొండారెడ్డి, గట్లా విజయభాస్కర్రెడ్డి, క్రీడాకారుల, స్కూల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.