సహచరులతో కలిసి సైక్లింగ్ చేసిన దుబాయ్ రూలర్..!
ABN , First Publish Date - 2020-08-08T17:55:37+05:30 IST
దుబాయ్ రూలర్, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన సహచరులతో కలిసి దుబాయ్ వాటర్ కెనాల్ చుట్టూ శుక్రవారం సాయంత్రం సైక్లింగ్ చేస్తూ ఆనందించారు.
దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన సహచరులతో కలిసి దుబాయ్ వాటర్ కెనాల్ చుట్టూ శుక్రవారం సాయంత్రం సైక్లింగ్ చేస్తూ ఆనందించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ క్రౌన్ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఈ ఫొటోలను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. కరోనా వైరస్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా షేక్ మొహమ్మద్, అతని పార్టీ సభ్యులు సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఫేస్ మాస్క్లు ధరించారు. 20 మంది సహచరులతో కలిసి సైక్లింగ్ చేసిన దుబాయ్ రూలర్... షేక్ జాయేద్ బ్రిడ్జిపై ఉన్న వాటర్ ఫౌంటేన్ వద్ద ఫొటోలు దిగారు.