శేష వాహనంపై శ్రీవారు
ABN , First Publish Date - 2021-09-19T05:38:06+05:30 IST
పవిత్రోత్సవాల్లో భాగంగా పెంచలకోన క్షేత్రంలో శనివారం ప్రాకారమండపంలో శేషవాహనంపై శ్రీవారిని కొలువుదీర్చారు.
కోనలో రెండో రోజు భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
రాపూరు, సెప్టెంబరు 18: పవిత్రోత్సవాల్లో భాగంగా పెంచలకోన క్షేత్రంలో శనివారం ప్రాకారమండపంలో శేషవాహనంపై శ్రీవారిని కొలువుదీర్చారు. హోమాలు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయ గోపుర కలశం, ధ్వజస్తంభాలను పవిత్రాలతో అలంకరించి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి, ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య పర్యవేక్షించారు. శుక్రవారం రాత్రే పెద్ద సంఖ్యలో భక్తులు కోనకు చేరుకుని పవిత్రోత్సవాల్లో పాల్గొన్నారు.