విద్యుదాఘాతంతో షిఫ్ట్ ఆపరేటర్కు గాయాలు
ABN , First Publish Date - 2022-09-24T05:48:49+05:30 IST
స్థానిక ఐటీఐ కాలనీ సమీపంలో గల 132 కేవీ సబ్స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్ ప్రమాదంలో షిఫ్ట్ ఆపరేటర్ బి.జనార్దనరావు తీవ్ర గాయాలపాలయ్యాడు.
బొబ్బిలి: స్థానిక ఐటీఐ కాలనీ సమీపంలో గల 132 కేవీ సబ్స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్ ప్రమాదంలో షిఫ్ట్ ఆపరేటర్ బి.జనార్దనరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ ఎం.నాగేశ్వరరా వు తెలిపారు. విద్యుత్ నిర్వహణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి కిందికి పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. సుమారు 80 శాతానికి పైగా కాలిపోవడంతో సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శశిభూషణరావు సూచనతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారని సీఐ తెలిపారు. జనార్దనరావు స్వగ్రామం బాడంగి మండలం వాడాడ.