శిఖర్ ధవన్ అర్ధసెంచరీ.. పంజాబ్ కింగ్స్ స్కోరు..
ABN , First Publish Date - 2022-04-26T02:22:33+05:30 IST
ముంబై : పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ ఐపీఎల్ సీజన్ 2022లో మరో అర్థం శతకం పూర్తి చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై
ముంబై : పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ ఐపీఎల్ సీజన్ 2022లో మరో అర్థం శతకం పూర్తి చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో రాణిస్తున్నాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్గా ఆడుతున్నాడు. 5 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఇక పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఎం తీక్షణ్ బౌలింగ్లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ధవన్తోపాటు భనుక రాజపక్స ఆడుతున్నాడు. కాగా 15 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 123/1గా ఉంది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. పంజాబ్ కింగ్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.