శిల్పాచౌదరికి బెయిల్‌ మంజూరు

ABN , First Publish Date - 2021-12-23T23:34:48+05:30 IST

నగరంలోని పలువురిని మోసం చేసిన కేసులో

శిల్పాచౌదరికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్: నగరంలోని పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పాచౌదరికి బెయిల్‌ మంజూరు అయింది. అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌‌ను రాజేంద్రనగర్‌ కోర్టు  మంజూరు చేసింది. వీవీఐపీలను మోసం చేసిన కేసులో శిల్పాచౌదరి అరెస్టైంది. రేపు జైలు నుంచి శిల్పాచౌదరి విడుదలయ్యే అవకాశం ఉంది. 


నగరంలో పలువురిని రూ. కోట్లలో మోసగించిన ఘరానా కిలేడీ శిల్పాచౌదరిని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  పోలీసుల కథనం ప్రకారం.. శిల్పాచౌదరి, కృష్ణ శ్రీనివాస ప్రసాద్‌ దంపతులు పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లా్‌సలో నివసిస్తున్నారు. శిల్పాచౌదరి తనను తాను సినీ నిర్మాతగా.. తన భర్తను రియల్టర్‌గా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ.. టాలీవుడ్‌ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్‌ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడితే.. లాభాలు భారీగా వస్తాయని నమ్మబలుకుతుంది. ఇలా పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. లాభాల మాట పక్కనపెడితే.. ఏళ్లు గడుస్తున్నా.. అసలు ఊసుకూడా ఎత్తకుండా దాటవేయడం శిల్ప నైజం.

Updated Date - 2021-12-23T23:34:48+05:30 IST