Thane : మరోసారి రెచ్చిపోయిన ShivSena కార్యకర్తలు
ABN , First Publish Date - 2021-10-12T17:44:57+05:30 IST
మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు...
ఆటోరిక్షా డ్రైవర్లను కొట్టిన వైనం
థానే (మహారాష్ట్ర): మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. థానే నగరంలో మహారాష్ట్ర బంద్ సందర్భంగా ఆటోడ్రైవర్లను శివసేన కార్యకర్తలు కొట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింసాకాండలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించిన ఘటనకు నిరసనగా కాంగ్రెస్, శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లతో కూడిన మహా వికాస్ అఘాది సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.థానే నగరంలో ఆటోరిక్షా డ్రైవర్లు ఆటోలు నడుపుతుండటంతో ఆగ్రహం చెందిన శివసేన కార్యకర్తలు వారిపై చేయి చేసుకున్నారు. బంద్ సందర్భంగా ముంబై, థానే నగరాల్లో మూడు కంపెనీల పోలీసు బలగాలను మోహరించారు.బంద్ సందర్భంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో 8 బస్సులను ధ్వంసం చేసినట్లు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ తెలిపింది.