మానవత్వం చాటుకున్న శివలాల్‌ యాదవ్‌ ట్రస్ట్‌

ABN , First Publish Date - 2021-05-09T13:35:10+05:30 IST

ఆ ఇంట్లో కరోనా బాధితులు ఉన్నారు. అనుకోకుండా

మానవత్వం చాటుకున్న శివలాల్‌ యాదవ్‌ ట్రస్ట్‌

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : ఆ ఇంట్లో కరోనా బాధితులు ఉన్నారు. అనుకోకుండా వారి తల్లి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శివలాల్‌ యాదవ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ మానవత్వాన్ని చాటుకుంది. ట్రస్టు చైర్మన్‌ మహేష్‌ యాదవ్‌ ఖర్చులను భరించడమే కాక దగ్గరుండి అన్నీ సమకూర్చి అంత్యక్రియలు చేయించారు. ఖైరతాబాద్‌లో ట్రస్ట్‌ చొరవను అందరూ అభినందించారు. 


Updated Date - 2021-05-09T13:35:10+05:30 IST