అర్ధరాత్రి.. రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పార్క్ చేసి ఉన్న బైక్.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అనుమానంతో ఇంకాస్త లోపలికి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-13T03:23:48+05:30 IST

అర్ధరాత్రి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లగానే అతడికి రోడ్డుపక్కన చెట్ల పొదల్లో ఓ బైకు పార్కు చేసి కనిపించింది. అర్ధరాత్రి సమయంలో బైకును ఎవరు పార్కు చేశారో అనుకుని షాక్ అయ్యాడు.

అర్ధరాత్రి.. రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పార్క్ చేసి ఉన్న బైక్.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అనుమానంతో ఇంకాస్త లోపలికి వెళ్లి చూస్తే..

అర్ధరాత్రి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లగానే అతడికి రోడ్డుపక్కన చెట్ల పొదల్లో ఓ బైకు పార్కు చేసి కనిపించింది. అర్ధరాత్రి సమయంలో బైకును ఎవరు పార్కు చేశారో అనుకుని షాక్ అయ్యాడు. పొదల దగ్గరగా వెళ్లి చూడగా షాక్ అయ్యాడు. రాజస్థాన్ బుండి జిల్లాలోని బుండి జిల్లాలో, తలెడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం మేరకు.. రాజస్థాన్ బుండి జిల్లాకు చెందిన ముస్కాన్ మేఘ్వాల్(19), హీరాలాల్ మేఘ్వాల్‌(24) ప్రేమించుకుంటున్నారు. రోజూ నిర్మానుష్య ప్రదేశంలో కలుసుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరూ మద్యానికి అలవాటు పడ్డారు. ఓ రోజు ఫుల్‌గా మద్యం తాగి ఊరి బయట అడవుల్లోకి వెళ్లారు. ఏమైందో ఏమోగానీ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగారు. అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


రాజస్థాన్‌లోని ఎంబీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. తాము జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. అతిగా మద్యం సేవించడం, విష పదార్థాలు తినడం వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-13T03:23:48+05:30 IST