బీటలు వారుతున్న గులాబీ పార్టీ
ABN , First Publish Date - 2022-06-24T13:48:52+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలో గులాబీ పార్టీ బీటలు వారుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలో గులాబీ పార్టీ బీటలు వారుతోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు నేతలు చేరనున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేరనున్నారు. అలాగే జడ్పీటీసీ కొమరం కాంతారావు పార్టీకి రాజీనామా చేశారు. నేడు గాంధీభవన్లో రేవంత్ రెడ్డి సమక్షంలో జడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్లో చేరనున్నారు. టీఆర్ఎస్లో పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది.