Andrew Symonds మృతి దిగ్భ్రాంతి కలిగించింది: కోహ్లీ

ABN , First Publish Date - 2022-05-16T01:05:13+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని

Andrew Symonds మృతి దిగ్భ్రాంతి కలిగించింది: కోహ్లీ

ముంబై:  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సైమండ్స్ మృతిపై టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. Symonds మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు భారత మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo)లో పోస్టు చేశాడు. సైమండ్స్ మరణవార్త తనను తీవ్రంగా బాధపెట్టిందని, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు అతడి కుటుంబానికి మనోస్థైర్యం నింపాలని ఆకాంక్షించాడు.


కాగా, ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, రాడ్ మార్ష్ మృతి చెందారు. ఇప్పుడు మరో క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆసీస్ క్రికెట్‌ను కలవరపరిచింది. సైమండ్స్ మృతి వార్త తెలిసిన వెంటనే తాజా మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. సైమండ్స్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



Updated Date - 2022-05-16T01:05:13+05:30 IST