Shocking Incident: నాలుగేళ్ల చిన్నారిని కాటు వేసిన మరు నిమిషంలోనే చనిపోయిన పాము..!

ABN , First Publish Date - 2022-06-23T18:05:16+05:30 IST

బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విషపూరిమైన ఓ పాము.. నాలుగేళ్ల చిన్నారిని కాటు వేసిన మరు నిమిషంలో చనిపోయింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ నాలుగేళ్ల చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం.

Shocking Incident: నాలుగేళ్ల చిన్నారిని కాటు వేసిన మరు నిమిషంలోనే చనిపోయిన పాము..!

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విషపూరిమైన ఓ పాము.. నాలుగేళ్ల చిన్నారిని కాటు వేసిన మరు నిమిషంలో చనిపోయింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ నాలుగేళ్ల చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతానికి చెందిన 4ఏళ్ల అంజు కుమార్.. ఎప్పటిలాగే ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన విషసర్పం.. నాలుగేళ్ల బాలుడిని కాటేసింది. దీంతో వెంటనే ఆ చిన్నోడు ఏడుస్తూ ఇంట్లోకి పరుగులు తీశాడు. అనంతరం తనకు పాము కుట్టిందని కుటుంబ సభ్యులకు వెల్లడించాడు. ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే.. ఇంటి ప్రాంగణం నుంచి కొద్ది దూరం వెళ్లిన పాము.. అక్కడే మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ చిన్నారితోపాటు చనిపోయిన పామును కూడా తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. 



అక్కడ అంజు కుమార్‌కు వైద్యలు చికిత్స చేశారు. అనంతరం అతడు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ బాలుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అంజు కుమార్‌ను కాటేసిన మరుక్షణంలోనే ఆ పాము చనిపోయిందని చెప్పారు. బాబును హాస్పిటల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనతో దానికి ఎవరూ హాని తలపెట్టలేదని పేర్కొన్నారు. చనిపోయిన పామును, అంజు కుమార్‌ను చూసేందుకు హాస్పిటల్ వద్ద జనం ఎగబడ్డారు. ఇదిలా ఉంటే.. ఆ విషసర్పం మరణించడానికి గల కారణం తెలియరాలేదు.


Updated Date - 2022-06-23T18:05:16+05:30 IST