అమెరికాలో మళ్లీ పేలిన తూటా...ఒకటి మృతి, 20 మందికి గాయాలు..!
ABN , First Publish Date - 2022-03-20T21:24:22+05:30 IST
అమెరికాలో మళ్లీ తూటా పేలింది. విరాళాలు సేకరించేందుకు తలపెట్టిన ఓ కార్ షోలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో 20 మంది గాయాలపాలయ్యారు.
డ్యూమాస్: అమెరికాలో మళ్లీ తూటా పేలింది. విరాళాలు సేకరించేందుకు తలపెట్టిన ఓ కార్ షోలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో 20 మంది గాయాలపాలయ్యారు. అర్కాన్సాస్ రాష్ట్రంలోని డ్యూమాస్ అనే టౌన్లో శనివారం ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో చిన్నారికి గాయాలయ్యాయి. బాధితుల్లో మొత్తం ఎంత మంది చిన్నారులు ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు.
కాల్పులు జరిపింది ఒకే వ్యక్తా కాదా అనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. పలువురు కాల్పులకు తెగబడి ఉండొచ్చని డ్యూమాస్ పోలీస్ అధికారి కీత్ అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, స్కూళ్లకు నిధుల కోసం విరాళాలు సేకరించేందుకు ఏటా స్థానికులు ఈ కార్ షో నిర్వహిస్తారు. ఇలాంటి ఘటన జరగడం చాలా విచారకరమని కార్ షో ప్రధాన నిర్వహకుడు వాలెస్ మెక్ఘీ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.