షోర్‌బేస్డ్‌ ఫెసిలిటీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-01T06:10:51+05:30 IST

రూ.కోటితో నాగాయలంక రేవు ఒడ్డున నిర్మిస్తున్న మత్స్యకారుల అదనపు షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవన నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని నాబార్డు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ టి.విజయ్‌ మత్స్యశాఖాధికారులు, కాంట్రాక్టరును ఆదేశించారు.

షోర్‌బేస్డ్‌ ఫెసిలిటీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి

నాగాయలంక  : రూ.కోటితో నాగాయలంక రేవు ఒడ్డున నిర్మిస్తున్న మత్స్యకారుల అదనపు షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవన నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని నాబార్డు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ టి.విజయ్‌ మత్స్యశాఖాధికారులు,  కాంట్రాక్టరును ఆదేశించారు.  మత్స్యశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు షేక్‌ లాల్‌ మహ్మద్‌, అవనిగడ్డ మత్స్యశాఖ అధికారులు తమ్ము పూర్ణయ్య, ఎం.రవికుమార్‌, కె.రమణకుమార్‌, గ్రామపెద్దలతో కలసి   నిర్మాణ పనులను విజయ్‌ పరిశీలించారు. సొర్లగొందిలోని భవనానికి ప్లాట్‌ ఫారం మరమ్మతులు, గోడ నిర్మించాలని కాంట్రాక్టరు పోలన రామ్మోహనరా వుకు సూచించారు.  

Updated Date - 2020-12-01T06:10:51+05:30 IST