విద్యుదాఘాతంతో లారీ దగ్ధం
ABN , First Publish Date - 2021-11-27T06:14:58+05:30 IST
విద్యుదాఘాతంతో లారీ దగ్ధం
నూజివీడు టౌన్, నవంబరు 26: తుక్కులూరు వద్ద విద్యుదాఘాతంతో ఒక లారీ పూర్తిగా దగ్ధమైంది. వరి కోత యంత్రాన్ని తెచ్చిన లారీకి యంత్రాన్ని దించాక విద్యుత్ వైర్లు తాకాయి. దీంతో మంటల చెలరేగాయి. వాహనడ్రైవర్ చాకచక్యంగా తప్పుకొన్నారు. లారీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.