త్వరలో బయటపడనున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే రాసలీలలు

ABN , First Publish Date - 2022-08-18T05:30:00+05:30 IST

ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యే రాసలీలలు త్వరలో బయటపడతాయని ఎమ్మెల్సీ దొరబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో బయటపడనున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే రాసలీలలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దొరబాబు

ఎమ్మెల్సీ దొరబాబు

చిత్తూరు సిటీ, ఆగస్టు 18: ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యే రాసలీలలు త్వరలో బయటపడతాయని ఎమ్మెల్సీ దొరబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ హేయమైన పని చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పైగా గోరంట్ల మాధవ్‌ ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తే స్వాతంత్య్ర సమరయోధునికి స్వాగతం పలికినట్లు భారీ ఏర్పాట్లు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు నుంచి ఆయన్ను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. చికోటి ప్రవీణ్‌ క్యాసినో ఆడిస్తే ఆయనను ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే మూల్యం తప్పదని హెచ్చరించారు.

Updated Date - 2022-08-18T05:30:00+05:30 IST