
అమరావతి: ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రచారంలో ఉన్న లిక్కర్ బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనివేనని సీఎం తెలిపారు. నవరత్నాలు మా బ్రాండ్స్ అయితే మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువేనని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఎన్నో మద్యం బ్రాండ్లను అనుమతి ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఆ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో 254 కొత్త బ్రాండ్లు వచ్చాయని ఆయన తెలిపారు. భూం భూం, గవర్న్ చాయిస్, పవర్స్టార్ 999, రష్యన్ రోమానోవా ఇలాంటి వన్నీ టీడీపీ బ్రాండ్లని ఆయన ఎద్దేవే చేశారు. 2014-2019 వరకు ఏడు డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని జగన్ తెలిపారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అంటే సరిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదేనని జగన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి