ఫ్రెండ్లీ ప్రభుత్వం వైసీపీ సర్కార్కు సహకరించాలి: బొత్స

ABN , First Publish Date - 2022-07-08T22:37:38+05:30 IST

Guntur: ఫ్రెండ్లీ ప్రభుత్వం వైసీపీ సర్కార్కు సహకరించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున

ఫ్రెండ్లీ ప్రభుత్వం వైసీపీ సర్కార్కు సహకరించాలి: బొత్స

Guntur: ఫ్రెండ్లీ ప్రభుత్వం వైసీపీ సర్కార్కు సహకరించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందన్నారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యా విధానంలో మార్పులను కొందరు హేళన చేస్తున్నారని, పోటీలో నిలబడలేని స్థితికి మన విద్యా విధానాన్ని గత పాలకులు తెచ్చారని విమర్శించారు.

Updated Date - 2022-07-08T22:37:38+05:30 IST