బందరు డీఎస్పీకి షోకాజ్ నోటీసులు

ABN , First Publish Date - 2022-03-20T00:36:05+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బందరు డీఎస్పీ మాసుం భాషాకికి

బందరు డీఎస్పీకి షోకాజ్ నోటీసులు

కృష్ణా: విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బందరు డీఎస్పీ మాసుం భాషాకికి జిల్లా ఎస్పీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీవోఏ నాగలక్ష్మి ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. నాగలక్ష్మి స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును బందరు రూరల్ సీఐకి ఎస్పీ బదిలీ చేశారు. అయినా కూడా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బందరు తాలూకా ఎస్ఐ, బందరు రూరల్ సీఐపై ఎస్పీ పూర్తి విచారణ జరిపారు. అలాగే బందరు డీఎస్పీ మాసుం భాషాకి షోకాజ్ నోటీసులను ఎస్పీ జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 


Updated Date - 2022-03-20T00:36:05+05:30 IST