మలుపులు తిరుగుతున్న శ్రావణి ఆత్మహత్య కేసు
ABN , First Publish Date - 2020-09-11T21:22:03+05:30 IST
టీవీనటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది.
హైదరాబాద్: టీవీనటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. గతంలో దేవరాజ్ రెడ్డి బర్త్ డే సందర్భంగా శ్రావణి మాట్లాడిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దేవరాజ్ తన ఫేవరెట్ హీరో అన్న శ్రావణి.. ‘‘ఎంతోమంది పరిచయం అయినా.. నువ్వు మాత్రమే స్పెషల్. ఇప్పటి వరకు నీలో ఏ మిస్టేక్ కనిపించలేదు. చాలా జెన్యూన్గా, నా ఫ్యామిలీ మెంబర్లా.. నా గురించి ప్రతి నిముషం ఆలోచిస్తావ్, నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెబుతానంటూ’’ వీడియోలో చెప్పింది. అయితే శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్, సాయి కృష్ణ.. ఇద్దరిలో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.