పట్టాభిషక్తుడై..

ABN , First Publish Date - 2021-04-23T10:28:58+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలో గురువారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

పట్టాభిషక్తుడై..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలో గురువారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రాతఃకాలార్చన, బాలభోగం అయిన తర్వాత ముందుగా యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. తర్వాత ఆస్థాన మండపంలో స్వామి వారిని వేంచేపు చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. పట్టాభిషేక సర్గ విన్నపం, పంచామృత స్నపనం చేసి శ్రీరామచంద్రస్వామికి కిరీటధారణ చేశారు. 

నెల్లిమర్ల

Updated Date - 2021-04-23T10:28:58+05:30 IST