అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-06T03:30:55+05:30 IST

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ ఆదిలక్ష్మి

కావలి రూరల్‌, జూలై 5: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 1వ పట్టణ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సంకులవారితోటకు చెందిన ఏడుంబాకల శ్రీనివాసులు(45) పట్టణ ఉత్తరశివారులోని లారీ యూనియన్‌ ఆఫీస్‌ ఎదురుగా వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న కుమారుడు గిరీష్‌, ఇంటర్‌ చదువుతున్న కుమార్తె జీవనల  చదువుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ప్రతి రోజూ మదనపడేవాడు. సోమవారం కుమార్తెను పట్టణంలోని కళాశాలలో వదిలివెళ్లిన ఆయన ఆ రాత్రి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు వెళ్లి వెతుకులాట చేపట్టారు. ఈక్రమంలో ఆయన వెల్డింగ్‌ షాపులోనే పైపుకు ఉరివేసుకుని వేలాడుతూ ఉండటాన్ని లారీ యూనియన్‌ సభ్యులు గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. భార్య ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఆదిలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-07-06T03:30:55+05:30 IST