బీజేపీ నాయకురాలి మృతి కేసులో ట్విస్ట్...భర్తకు అంతర్జాతీయ రాకెట్తో సంబంధాలు
ABN , First Publish Date - 2022-05-02T17:20:58+05:30 IST
బీజేపీ నాయకురాలు శ్వేతాసింగ్ గౌర్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది.
లక్నో(ఉత్తరప్రదేశ్): బీజేపీ నాయకురాలు శ్వేతాసింగ్ గౌర్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ సంబంధాన్ని దాచేందుకే భర్త శ్వేతాసింగ్ను హత్య చేశాడని మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది.శ్వేతా సింగ్ గత వారం బండా పట్టణంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. శ్వేతా సజీవంగా ఉన్నప్పుడు రహస్యంగా రికార్డ్ చేసిన ఆడియో క్లిప్లు తాజాగా వెలుగుచూశాయి.ఈ ఆడియో క్లిప్లలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్తో తన భర్త దీపక్ సింగ్కు గల లింక్లను సూచించాయి. శ్వేతా సింగ్ సజీవంగా ఉన్నపుడు తన భర్త ఫోన్ కాల్లను రికార్డ్ చేయడం ప్రారంభించింది.శ్వేతాను భర్త దీపక్ సింగ్ గౌర్, అతని తల్లి, తండ్రి, అన్నయ్యలు కలిసి ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబం ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టింది.
భర్త దీపక్ సింగ్ రష్యన్, మొరాకో, ఆఫ్రికన్ అమ్మాయిలను తార్చడం కోసం బ్రోకర్లతో మాట్లాడిన సాక్ష్యాలను మృతురాలు నమోదు చేసింది. శ్వేతా సింగ్ గౌర్ తన మరణానికి ముందు ఈ ఆడియో రికార్డులను తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. రష్యాలోని సెక్స్ వర్కర్లతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దాచిపెట్టేందుకే దీపక్ సింగ్ గౌర్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె సోదరుడు రీతురాజ్ ఆరోపించారు.దీపక్ సింగ్ గౌర్ రష్యన్ అమ్మాయిలను సరఫరా చేస్తున్న బ్రోకరుతో మాట్లాడిన ఆడియో వెలుగుచూసింది. మరో ఆడియో క్లిప్లో దీపక్ నగదు చెల్లిస్తానని చెప్పాడని, అయితే బ్రోకర్ ఆన్లైన్లో చెల్లించమని అడిగాడని తేలింది.
మరో సంభాషణలో దీపక్ ఇద్దరు అమ్మాయిలను పంపమని బ్రోకర్ని అడిగాడు.పోలీసులు దీపక్ సింగ్ గౌర్ను గత శుక్రవారం అరెస్టు చేయగా, ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పలు ఆడియోలు తమకు అందాయని, వాటన్నింటినీ విచారిస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ అభినందన్ తెలిపారు.