వీజీ మిసెస్ ఇండియా ఫైనెస్సీ సెకెండ్ రన్నరప్‌, మిసెస్ ఇండియా ఉత్తరాఖండ్‌గా శ్వేతా సింగ్

ABN , First Publish Date - 2022-07-19T17:53:54+05:30 IST

వీజీ మిస్ అండ్ మిసెస్ 3వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో...

వీజీ మిసెస్ ఇండియా ఫైనెస్సీ సెకెండ్ రన్నరప్‌, మిసెస్ ఇండియా ఉత్తరాఖండ్‌గా శ్వేతా సింగ్

వీజీ మిస్ అండ్ మిసెస్ 3వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో శ్వేతా సింగ్ వీజీ మిసెస్ ఇండియా ఫైనెస్సీ సెకెండ్ రన్నరప్ 2022 టైటిల్‌ను గెలుచుకున్నారు. అలాగే వీజీ మిసెస్ ఇండియా ఉత్తరాఖండ్- 2022 టైటిల్‌ను కూడా దక్కించుకున్నారు. ఇదేవిధంగా ఆమె బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్, ది పాపులర్ క్వీన్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.  శ్వేతా సింగ్ వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్. సోషల్ వర్కర్. శ్వేతా ఆర్ట్స్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ వ్యవస్థాపకురాలు. 


ప్రస్తుతం ఆమె బ్లెస్సింగ్స్ ఎన్జీఓ, మ్యాన్‌కైండ్ కేర్ ఫౌండేషన్, సాయి ఆశ్రయ్, సిక్కు విర్సా సేవా సొసైటీ మొదలైన స్వచ్ఛంద సంస్థలలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె పిల్లలతో సమయం గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ఉత్తరాఖండ్‌కు చెందిన శ్వేతా సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త ఆమెకు అన్ని విషయాల్లోనూ సహకారం అందిస్తారు. శ్వేతా సింగ్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గుర్గావ్‌లోని ఉమ్రావ్‌లో జరిగిన ఈ అందాల పోటీకి కునాల్ కపూర్ (బాలీవుడ్ నటుడు), ఆరుషి నిశాంక్ (బాలీవుడ్ నటుడు), అమితాబ్ శ్రీవాస్తవ (ఐ మీడియా ఇంటర్నేషనల్ డైరెక్టర్) తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

Updated Date - 2022-07-19T17:53:54+05:30 IST