గొప్ప జాతీయవాది శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ

ABN , First Publish Date - 2022-07-07T05:17:49+05:30 IST

భారతదేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని, ఒకే విధానం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప జాతీయవాది డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ అని శ్రీ గాయత్రీ నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ శశిబిందు పేర్కొన్నారు.

గొప్ప జాతీయవాది శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ
చిత్రపటానికి పూలమాల వేస్తున్న దృశ్యం

జయంతి వేడుకలో గాయత్రీ నేత్రాలయ చైర్మన్‌

కడప మారుతీనగర్‌, జూలై6: భారతదేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని, ఒకే విధానం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప జాతీయవాది డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ అని శ్రీ గాయత్రీ నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ శశిబిందు పేర్కొన్నారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బాలాజీ నగర్‌లోని నెహ్రూయువ కేంద్ర సమావేశ మందిరంలో వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నెహ్రూకేంద్ర యువ అధికారి కె. మణికంఠ, సిబ్బంది జి. ప్రేమానందం, వలంటీర్లు స్థానికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:17:49+05:30 IST