ఘనంగా శ్యామాప్రసాద్‌ ముఖర్జి జయంతి

ABN , First Publish Date - 2022-07-07T06:14:14+05:30 IST

ఆర్టికల్‌ 370ని ఎత్తివేయాలని తన ప్రాణాలనొడ్డిన గొప్పనేత భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు.

ఘనంగా శ్యామాప్రసాద్‌ ముఖర్జి జయంతి
శ్యామాప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 6: ఆర్టికల్‌ 370ని ఎత్తివేయాలని తన ప్రాణాలనొడ్డిన గొప్పనేత భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బుధవారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్‌ కార్యాలయంలో డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ముఖర్జీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆర్టికల్‌ 370ని రద్దు చేసి శ్యామాప్రసాద్‌ముఖర్జీకి ఘన నివాళులర్పించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, కల్లెం వాసుదేవరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, బోయినపల్లి ప్రవీణ్‌రావు, జిల్లా ఆఫీస్‌ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్‌, మీడియా కన్వీనర్‌ కటకం లోకేష్‌, జిల్లా, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T06:14:14+05:30 IST