ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు వసూలు.. నలుగురిపై కేసు

ABN , First Publish Date - 2020-07-06T11:45:21+05:30 IST

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు కాజేసిన నలు గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు..

ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు వసూలు.. నలుగురిపై కేసు

కొవ్వూరు, జూలై 5 : ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు కాజేసిన నలు గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన చింతా సాయిశిరీషాకు మెరక వీధికి చెందిన కోటాబత్తుల అఖిలేశ్‌, మురళీకృష్ణ, శ్రీనివాస్‌, పర్మిళ ఉద్యోగం ఇప్పి స్తామని దఫ దఫాలుగా రూ.15లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో తీసు కున్న డబ్బులను అడిగితే ఇంటికి వచ్చి శిరీషాను బెదిరించి అసభ్యకరంగా ప్రవర్తిం చడంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-07-06T11:45:21+05:30 IST