జిల్లాలో ఏడుగురు ఎస్సైలు బదిలీలు

ABN , First Publish Date - 2021-05-09T05:40:38+05:30 IST

జిల్లాలో ఏడుగురు ఎస్సైలు బదిలీలు

జిల్లాలో ఏడుగురు ఎస్సైలు బదిలీలు

మహబూబాబాద్‌ రూరల్‌, మే 8 : జిల్లాలో వివిధ పోలీ్‌సస్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌.రమే్‌షబాబును కేసముద్రం ఎస్సైగా బదిలీ చేశారు. తొర్రూరు ఎస్సై సీహెచ్‌.నగే్‌షను మహబూబాబాద్‌ రూరల్‌ ఎస్సైగా, సీరోలు ఎస్సై బి.రాణాప్రతా్‌పను కురవి ఎస్సైగా, మహబూబాబాద్‌ టౌన్‌-1 ఎస్సై బి.సంతో్‌షరావును సీరోలు ఎస్సైగా, మహబూబాబాద్‌ టౌన్‌-2 ఎస్సై జి.మురళీధర్‌రాజును దంతాలపల్లి ఎస్సైగా, కురవి ఎస్సై జక్కుల శంకర్‌రావును మహబూబాబాద్‌ టౌన్‌-1 ఎస్సైగా, దంతాలపల్లి ఎస్సై బి.వెంకన్నను మహబూబాబాద్‌ టౌన్‌-2 ఎస్సైగా బదిలీ చేశారు. వీరు త్వరలో ఆయా పోలీ్‌సస్టేషన్‌లలో బాధ్యతలు చేపట్టనున్నారు. 


Updated Date - 2021-05-09T05:40:38+05:30 IST