ప్రశాంతంగా ఎస్ఐ రాత పరీక్ష
ABN , First Publish Date - 2022-08-08T05:58:07+05:30 IST
జిల్లాలో ఎస్ఐ రాత పరీక్షలు ఆదివారం ప్ర శాంతంగా ముగిశాయి.
- ఏడు కేంద్రాల్లో 3831 మంది అభ్యర్థులకు 3795 మంది హాజరు.. 36 మంది గైర్హాజరు
- కేంద్రాలను పరిశీలించిన ఇన్చార్జి సీపీ సత్యనారాయణ
కోల్సిటీ, ఆగస్టు 7: జిల్లాలో ఎస్ఐ రాత పరీక్షలు ఆదివారం ప్ర శాంతంగా ముగిశాయి. పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరిఖని ప్రభు త్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. గోదావరిఖని డిగ్రీ కళాశాల కేంద్రాన్ని ఇన్చార్జి సీపీ సత్యనారాయణ పరిశీలించారు. జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటు చేయగా, మొత్తం 3831మంది అభ్యర్థులకుగాను 3795 మం ది పరీక్షకు హాజరుకాగా, 36 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలి పారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నం దున పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, ఎస్బీ ఏసీపీ మోహన్, సీఐలు రమేష్బాబు, ప్రవీణ్కుమార్, లక్ష్మీనారాయణ బందోబస్తు నిర్వహించారు.