చేర్యాలలో మున్సిపల్ కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-07T01:11:25+05:30 IST

చేర్యాల మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని

చేర్యాలలో మున్సిపల్ కార్మికుల ఆందోళన

సిద్దిపేట: చేర్యాల మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5వేల రూపాయల నజరానా చెల్లించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు బైటాయించారు. ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికులను కౌన్సిలర్ అసభ్య పదజాలంతో దూషించాడంటూ వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిలర్, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated Date - 2020-07-07T01:11:25+05:30 IST