TS News: దేశభక్తిని చాటుకున్న యువ రైతు..

ABN , First Publish Date - 2022-08-14T21:31:38+05:30 IST

సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలానికి చెందిన యువ రైతు జక్కుల తిరుపతి దేశభక్తిని చాటుకున్నారు.

TS News: దేశభక్తిని చాటుకున్న యువ రైతు..

సిద్దిపేట (Siddipet) జిల్లా: 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, నాగపురి గ్రామానికి చెందిన యువ రైతు (farmer) జక్కుల తిరుపతి దేశభక్తిని చాటుకున్నారు. తన పొలంలో భారత దేశ (India) చిత్రాన్ని, జాతీయ జెండా (National flag)ను వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశానుసారం తిరుపతి తన సొంత వ్యవసాయ పొలంలో దేశవాల కాలబట్టి, నలుపు రంగు వరితో భారత దేశ చిత్రాన్ని, జాతీయ జెండాను ఆవిష్కరించి తనకున్న దేశ భక్తిని చాటుకున్నారు. నిజమైన దేశ భక్తి అంటే మనకున్న వ్యవసాయ భూమిలో సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేయడమేనని రైతు తిరపతి అన్నారు. దేశ సరిహద్దుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న జవాన్లకు ఈ చిత్ర పటాన్ని అంకితమిస్తున్నట్లు తిరుపతి తెలిపారు.

Updated Date - 2022-08-14T21:31:38+05:30 IST