సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2022-03-09T23:53:14+05:30 IST

ద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. భూ వివాదంలో వంశీ కృష్ణపై ఒగ్గు తిరుపతి, అతని అనుచరులు కాల్పులకు జరిపారు.

సిద్దిపేట జిల్లాలో  కాల్పుల కలకలం

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.  భూ వివాదంలో వంశీ కృష్ణపై ఒగ్గు తిరుపతి, అతని అనుచరులు కాల్పులకు జరిపారు. తొగుట మండలం వెంకట్రావు పేట్ శివారులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం చల్లాపూర్‌కు చెందిన ఒగ్గు తిరుపతి, వంశీ మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. గతంలో తిరుపతిపై వంశీకృష్ణ హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో వంశీపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే వంశీకృష్ణపై తిరుపతి కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-03-09T23:53:14+05:30 IST