రాష్ట్రస్థాయి కరాటేలో సిద్దిపేటకు 14 పతకాలు
ABN , First Publish Date - 2021-03-02T06:00:19+05:30 IST
‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డో’ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లిలో 10వ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు అల్ కరాటే పోటీలు జరిగాయి. వివిధ జిల్లాల నుండి 600 మంది క్రీడా కారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో
సిద్దిపేట, మార్చి 1: ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డో’ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లిలో 10వ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు అల్ కరాటే పోటీలు జరిగాయి. వివిధ జిల్లాల నుండి 600 మంది క్రీడా కారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సిద్దిపేటలోని జపాన్ కరాటే షోటో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థులు 3 బంగారు, 4 రజిత, 7 కాంస్య పతకాలు సాధించినట్లు రాష్ట్ర చీఫ్ ఇన్స్ట్రక్టర్ పాషా తెలిపారు. వీరిలో కోడారి రక్షిత్, మాడుగుల రేవంత్, అస్మా తరన్నుమ్లు బంగారు పతకాలను, హర్షశ్రీ, శ్రీహిత, ఆహాద్, అరిబా హునైన్లు రజిత, కోడారి దీక్షిత్, ద్రోణ వర్షిత, కన్నయ్య, హర్షవర్ధన్, సాయి, అఖిరాలు కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. విజేతలకు రాష్ట్ర కార్యదర్శి ఇప్ప శ్రీనివాస్ పతకాలను, ధ్రువపత్రాలను అందజేశారు.