సంతకాల ఫోర్జరీ.. కేసు నమోదు
ABN , First Publish Date - 2021-07-27T04:46:46+05:30 IST
సంతకాల ఫోర్జరీ.. కేసు నమోదు
ఘట్కేసర్ రూరల్: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి గ్రామకంఠం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన ఘట్కేసర్ మండలం ఎదులాబాద్లో చోటుచే సుకుంది. సీఐ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... ఎదులాబాద్ పంచాయతీ కార్యదర్శి రాసాల నర్సిం గ్రావు సంతకాలను గుర్తుతెలియని వ్యక్తులు పంచాయతీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసి యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని ఎల్లయ్యకు ఇచ్చారు. ఈ ధ్రువీకరణ పత్రాలతో ఎల్లయ్య గ్రామ కంఠం స్థలాన్ని 2021 జూన్ 28న ఘట్కేసర్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. కాగా ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దస్తావేజులతో పంచాయతీ కార్యాలయానికి వెళ్లి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. యాజమాన్య ధ్రువీకరణ పత్రంపై ఉన్న ఫోర్జరీ సంతకాలను గుర్తించిన కార్యదర్శి తన సంతకం ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్టు నిర్ధారించారు. తన సంతకాల ఫోర్జరీపై కార్యదర్శి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.