దీపిక బృందానికి రజతం ఆర్చరీ

ABN , First Publish Date - 2022-06-27T10:01:26+05:30 IST

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు రజత పతకం దక్కించుకుంది.

దీపిక బృందానికి రజతం  ఆర్చరీ

 ప్రపంచకప్‌

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు రజత పతకం దక్కించుకుంది. ఫైనల్లో దీపికా కుమారి, అంకితా భకత్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌తో కూడిన భారత త్రయం 1-5తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లీ చెన్‌-యింగ్‌తో కూడిన చైనీస్‌ తైపీ జట్టు చేతిలో పరాజయంపాలై రజతంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ మెగా టోర్నీలో ఈసారి భారత్‌ ఓ స్వర్ణం, రెండు రజతాలతో మొత్తం మూడు పతకాలు అందుకుంది. ఇందులో రెండు పతకాలు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించినవే ఉండడం విశేషం. 

Updated Date - 2022-06-27T10:01:26+05:30 IST